

కనకాపూర్ లో బీఆర్ఎస్ క్యాలెండర్, డైరి ఆవిష్కరణ….
బీఆర్ ఎస్ యువ నాయకులు ఇర్ల గణేష్
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం: మండలంలోని కనకాపూర్ గ్రామంలో మంగళవారం బీఆర్ఎస్ ముధోల్ నియోజక వర్గ అధ్యక్షులు కిరణ్ కొమ్రే వార్, లోలం శ్యాంసుందర్. ఆదేశాల మేరకు ఇర్ల గణేష్, ఓంకార్ దేవేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి క్యాలెండర్ మరియు డైరి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా బి ఆర్ఎస్ యువ నాయకులు ఇర్ల గణేష్ మాట్లాడుతూ..ముధోల్ నియోజక వర్గం లో ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో ఇచ్చిన ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తుందని అన్నారు.దింతో రైతులకు రైతు బందు విడుదల చేస్తామని చెప్పిన ఇప్పటి వరకు కనీసం రెండు ఎకరాలకు కూడా రైతు బందు డబ్బులు జమ చేయలేదని విమర్శించారు. కేసిఆర్ ప్రభుత్వంలో రైతులకు సరైన సమయంలో రైతు బందును విడుదల చేసి రైతులకు పెట్టుబడి సహాయం అందించిన ప్రభుత్వం అంటే బిఆర్ ఎస్ ప్రభుత్వమే అని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సాలయి పోతున్న, ఇర్ల దేవేందర్, గాలాయి భూమన్న, తోట బాబు, చెంచుల భీమన్న, బందెల శ్రీకాంత్, బిఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.