

ఒకే దేశం ఓకే ఎన్నికతో దేశాభివృద్ధి
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- ఒకే దేశం ఓకే ఎన్నిక ఎన్నికతో ప్రజలపై ఆర్థిక భారం పడకుండా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రోగ్రాం అధికార ప్రతినిధి పైడిపల్లి గంగధర్, ఓకే దేశం ఓకే ఎన్నిక ప్రోగ్రాం జిల్లా కోకన్వీనర్ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం బైంసా పట్టణంలోని ఎస్ ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో బిజెపి మండల నాయకులతో కలిసి వర్క్ షాప్ ను నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. దేశవ్యాప్తంగా పళ్ళు దఫాలుగా ఎన్నికలు రావడంతో ఎలక్షన్ కోడ్ పేరుతో ప్రజాసేవకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి గ్రామంలో నలుగురు గుమి గూడిన చోట రచ్చబండలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. సుస్థిరపాలన అందించాలంటే ఓకే దేశం ఓకే ఎన్నికతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమం మండల కన్వీనర్ గా ఎన్నికైన సాయినాథ్, పట్టణ కన్వీనర్ గా ఎన్నికైన దిలీప్ ను శాలవాతో సత్కరించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నారాయణరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు తాలోడ్ శ్రీనివాస్,బైంసా పట్టణ బిజెపి అధ్యక్షులు మల్లేష్, మండల అధ్యక్షురాలు సిరం సుష్మ రెడ్డి, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ కౌన్సిలర్ గౌతం పింగ్లే,నాయకులు భూమేష్, బండారి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
