

- ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..
మనోరంజని ప్రతినిధి మార్చి 25 – రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్..
- ఏసీబీ వలలో పిఠాపురం రూరల్ ఎస్సై..
రూ. 20,000/- లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై గుణశేఖర్..
కాకినాడ జిల్లా: పిఠాపురం.
- రూ.20,000/- లంచం తీసుకుంటూ పిఠాపురం రూరల్ ఎస్సై గుణశేఖర్ ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. పిఠాపురం మండలం దొంతమూరు గ్రామానికి చెందిన కిల్లాడి దుర్గాప్రసాద్, సానబోయిన గంగరాజు అనువారి నుండి (ఎస్సీ ఎస్టీ కేసు నుండి ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు పేర్లను తొలగించేందుకు) రూ. 20,000 లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై ఎల్.గుణశేఖర్, అతని వ్యక్తిగత డ్రైవర్ శివ ఎసిబి అధికారులకు చిక్కారు. అవినీతి నిరోధక శాఖ డిఎస్పి కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఎసిబి సిబ్బంది పక్కా సమాచారంతో దాడిచేయగా లంచం తీసుకుంటూ రూరల్ ఎస్సై గుణశేఖర్ అధికారులకు పట్టుబడ్డారు. జరిగిన సంఘటనపై కాకినాడ అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్ శాఖపరమైన విచారణ చేపట్టారు.