

ఏసీబీ అధికారులకు చిక్కిన విద్యుత్ శాఖ ఏడీ…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కారు. ఫ్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ ప్రతినిధి నుంచి రూ.70 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్తు శాఖ ఏడీ ఏసీబీకి గురువారం చిక్కారు…
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని విద్యుత్ శాఖ ఏడీ కార్యాలయంపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నిజామాబాద్కు చెందిన ప్రీ ఎనర్జీ సోలార్ ఏజెన్సీ సంస్థ కాంట్రాక్టర్ నుంచి చౌటుప్పల్ ట్రాన్స్కో ఏడీ శ్యాంప్రసాద్ రూ.70 వేల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతని నుంచి నగదు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. దాడి చేసిన వారిలో అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ జగదీష్ చందర్, సీఐలు రామారావు, వెంకట్రావు పాల్గొన్నారు. సరూర్నగర్లోని నిందితుని ఇట్లో నిర్వహిస్తున్న తనిఖీల్లో సీఐలు రఘునందన్, వెంకటేష్ పాల్గొన్నారు.