

ఎన్ హెచ్ ఆర్ సి సారంగాపూర్ మండల అధ్యక్షులుగా న్యారబోయిన వంశీకృష్ణ
నియామక ఉత్తర్వులు అందించిన జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ (జగిత్యాల జిల్లా): మార్చి ౦8 _జా తీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ఆదేశాల మేరకు జిల్లాలోని సారంగాపూర్ మండల కమిటీ అధ్యక్షులుగా న్యారబోయిన వంశీకృష్ణను నియమించినట్లు జగిత్యాల జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేకూట శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు నేరెళ్ల శ్రీనివాస్ తెలిపారు. ప్రజా సమస్యలపై అవగాహన కలిగిన సామాజిక ఉద్యమకారుడు వంశీకృష్ణను గుర్తించి ఈ పదవిని అప్పగించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కాసారపు శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తావులేని సమాజం కోసం రాష్ట్ర, జిల్లా కమిటీల ఆదేశాల మేరకు సంస్థ బలోపేతం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు. సారంగాపూర్ మండల అధ్యక్షులుగా నియమితులైన వంశీకృష్ణ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం పేద ప్రజల పక్షాన ప్రశ్నించేగొంతుకగా నిజాయితిగా కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కోల రాజేశం గౌడ్, జిల్లా సంయుక్త కార్యదర్శి ఎనగందుల గణేష్, జగిత్యాల పట్టణ అధ్యక్షులు గుగ్గిళ్ళ సత్యనారాయణ తదితరులు పాల్గొని వంశీకృష్ణను అభినందించారు