ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి

ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి

గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ

బాధితురాలు సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతున్న సమయంలో ఘటన జరిగిందని వెల్లడి

యువతి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందన్న ఎస్పీ

ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచారయత్నం ఘటనపై రైల్వే పోలీసు ఎస్పీ చందనదీప్తి మీడియాతో మాట్లాడారు. గాంధీ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, నిన్న సాయంత్రం 26 ఏళ్ల యువతి ఎంఎంటీఎస్ రైలులోని మహిళా కంపార్టుమెంటులో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళుతుండగా ఈ ఘటన జరిగిందని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో ఆమె ఎక్కినప్పుడు ఇద్దరు మహిళలు ఉన్నారని, వారు అల్వాల్ స్టేషన్ వద్ద దిగిపోయారని తెలిపారు. అదే కంపార్టుమెంటులో ఉన్న వ్యక్తి తన వద్దకు వచ్చి గట్టిగా పట్టుకున్నట్లు యువతి తెలిపిందని, ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఉందని అన్నారు. అతను ఏమైనా చేస్తాడేమోననే భయంతో యువతి రైలులో నుంచి దూకేసిందని ఎస్పీ తెలిపారు. నిందితుడిని గుర్తు పట్టలేనని బాధితురాలు చెబుతోందని, కానీ అతను ఎక్కడ ఎక్కాడో చెప్పగలనని తమకు తెలిపిందని ఆమె వెల్లడించారు. యువతి ప్రాణాపాయస్థితి నుంచి బయటపడిందని ఎస్పీ తెలిపారు. నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు

  • Related Posts

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టులు, జర్నలిస్టుల సంక్షేమం ముసుగులో తమ సొంత ప్రయోజనాలు చక్కదిద్దుకుంటున్న వ్యక్తుల విషయంలో జర్నలిస్టు సమాజం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్ అన్నారు. కొన్ని సంఘాల ఏకచత్రాధిపత్య విధానాలకు వ్యతిరేకంగా…

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax… ఎగవేతదారులు, బినామీలు, దాచిన డబ్బు, క్రిప్టో అసెట్స్ను గుర్తించడానికి Income Tax సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వాట్సాప్, ఇన్స్టీ, గూగుల్ మ్యాప్స్ను విశ్లేషించి వాటిని కనిపెట్టేస్తోంది. ఎగవేసిన ₹200CRను WA ఎన్లిప్టెడ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    జర్నలిస్టు సమాజం అప్రమత్తం అవసరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాడూరు కరుణాకర్

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    మే 1 నుంచి పెరగనున్న బ్యాంకు ఛార్జీలు

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    వాట్సాప్, గూగుల్ మ్యాప్స్ దొంగడబ్బు కనిపెట్టిన Income Tax…

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!

    AP And TG Weather Report: నేటి నుంచి భానుడి భగభగ.. ఏపీ, తెలంగాణలో ఈ జిల్లా ప్రజలకు అలర్ట్!