

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలుపు పట్ల తపస్ సంబరాలు


మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 08 :- ఇటీవల జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తపస్ బలపరిచిన బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం ఒక చారిత్రాత్మక మలుపు అని తపస్ ఆధ్వర్యంలో భైంసా పట్టణంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ గెలుపు జాతీయవాద శక్తులకు ఉత్సాహంగా పనిచేయడానికి స్ఫూర్తిని కలిగిస్తుందని, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మరింత బలోపేతం అయ్యే దిశలో మార్పు కానుందని,సంఖ్యా బలం కన్నా సైద్ధాంతిక బలమే గొప్పది అని ఈ విజయం నిరూపించింది అని, అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు.అనంతరం టపాసులు కాల్చి,మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాజేష్ బాబు, తపస్ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్, జిల్లా నాయకులు జి.రాజేశ్వర్,దత్తురాం షిండే,సాయన్న,ఆర్.రాజేశ్వర్,విఠల్,పండరి,సాయినాథ్,రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.