

ఉపాధ్యాయులు కృత్రిమ మేధ వంటి మార్పులను అలవాటు చేసుకోవాలి.
జిల్లా విద్యాశాఖ అధికారి.
మనోరంజని ప్రతినిధినిర్మల్ మార్చి 29 :-జిల్లా విద్యాశాఖ ఆద్వర్యంలో జిల్లాలోని ఈనెలలో అనగా మార్చి 31 వ తేదీన పదవి విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు శనివారం సాయంత్రం జిల్లా విద్యాశాఖ కార్యాలయం నందు ఆత్మీయ సన్మానం నిర్వహించడం జరిగింది. జిల్లా విద్యాశాఖ చరిత్రలో తొలిసారిగా పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులు 7 గురికి జిల్లా విద్యాశాఖ అధికారి పి. రామారావు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలి, విద్యార్థులకు విద్యా బోధనను కూడా అందించడం జరిగుతుంది. వీరు ఎందరో భావి పౌరులను దేశానికి అందించడం జరిగిందని. వీరి కృషికి గుర్తింపు చాలా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయులు కృత్రిమ మీద సహాయంతో అద్భుతాలు సృష్టిస్తున్నారుని, ఉపాధ్యాయులు కాలానుగుణంగా మార్పును గ్రహించాలని, వాటిని అలవాటు చేసుకోవాలని సూచించారు. పదవి విరమణ పొందు ఉపాధ్యాయులు తమ భావి జీవితాన్ని మంచి ఆరోగ్యంతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అధికారి రమణా రెడ్డి, పరీక్షల సహాయ కమీషనర్ ముడారపు పరమేశ్వర్, విద్యాశాఖ పర్యవేక్షకులు వెంకట రమణ, విద్యాశాఖ సమన్వయ కర్తలు రాజేశ్వర్, నర్సయ్య, సలోమీ కరుణ, ప్రవీణ్ కుమార్, లింబాద్రి, డి సీ ఈ బి సహాయ కార్యదర్శి భానుమూర్తి, ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు