ఇది కదా పోలీసుల పవర్..

ఇది కదా పోలీసుల పవర్..

నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

కత్తులు, కర్రలతో దాడి..

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ వస్త్రల్ ఏరియాలో గత కొద్ది రోజుల నుంచి రౌడీలు రెచ్చిపోతున్నారు. హోలీకి ఒకరోజు ముందు మార్చి 13వ తేదీన 20 మంది రౌడీలు రోడ్డుపైకి వచ్చారు. వారి చేతుల్లో కత్తులు, కర్రలు ఉన్నాయి. రోడ్డు మీదకు వచ్చిన ఆ 20 మంది ఓ కారుపై దాడికి దిగారు. కారు ఓనర్‌ను దారుణంగా చితక్కొట్టారు. అంతటితో ఆగకుండా.. రోడ్డుపై వెళుతున్న మరికొన్ని వాహనాలపై కూడా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసు అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. సంఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు ఆదేశించారు. పోలీసుల దర్యాప్తులో ఏం తేలిదంటే.. వస్త్రల్ ఏరియాలో ఓ ఫుడ్ స్టాల్ తెరిచే విషయంలో రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. పంకజ్ భవ్‌సార్ అనే వ్యక్తి సంగ్రమ్ సికార్‌వర్‌పై పగ పెంచుకున్నాడు. సంగ్రమ్‌ను ఫుడ్ స్టాల్ ఓపెన్ చేయనీయకుండా అడ్డుకున్నాడు.

రౌడీలకు చుక్కలు..

వాహనదారులపై కత్తులు, కర్రలతో దాడి చేసిన 20 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారికి తమదైన స్టైల్లో బుద్ధి చెప్పారు. 12 మందిని రోడ్డు మీద నడిపించి మరీ కొట్టారు. అది కూడా ఆ రౌడీలు నివసించే ప్రాంతంలో తిప్పుతూ చావకొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘ అలాంటి వారికి అలా పోలీస్ స్టైల్‌లో బుద్ధి చెప్పాల్సిందే’..’ అన్ని రాష్ట్రాల్లో పోలీసులకు ఇలాంటి మద్ధతు లభిస్తే బాగుంటుంది. సమాజం బాగు పడుతుంది’..’ కొనసాగించండి.. పోలీస్ బెల్టులకు పని చెప్పాల్సిందే’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, కొంత మంది మాత్రం వడోదరాలో జరిగిన సంఘటనను గుర్తు చేస్తున్నారు. మహిళను యాక్సిడెంట్ చేసి చంపిన వ్యక్తిని ఇంకా ఎందుకు శిక్షించలేదని ప్రశ్నిస్తున్నారు.

  • Related Posts

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఫ్లాష్ ఫ్లాష్ అమెరికాలో రోడ్డు ప్రమాదం కొందుర్గు వాసుల మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందినవారు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్…

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని మృతి గుడ్డు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం