

- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పోలీస్ బాస్ ఎంపికపై కసరత్తు ప్రారంభించింది..
- డీజీపీ ఎంపిక కోసం ఐదుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లు కేంద్రానికి పంపింది ఏపీ ప్రభుత్వం..
- సీనియర్ ఐపీఎస్ అధికారులైన
- మాదిరెడ్డి ప్రతాప్..
- రాజేంద్ర నాథ్రెడ్డి..
- హరీష్ కుమార్ గుప్తా..
- కుమార్ విశ్వజిత్..
- సుబ్రహ్మణ్యం పేర్లు కేంద్రానికి పంపించింది రాష్ట్ర సర్కార్..
- అయితే, వీరిలో మూడు పేర్లు ఎంపిక చేసి తిరిగి ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనుంది కేంద్రం..
- ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ ఇంఛార్జ్ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా కొనసాగుతోన్న
- విషయం విదితమే..
- డీజీపీ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
- ఇంఛార్జ్ల నుంచి పూర్తిస్థాయి
- డీజీపీ నియామాకానికి మొగ్గు చూపిన రాష్ట్ర ప్రభుత్వం యూపీఎస్సీ ద్వారా డీజీపీని ఎంపిక చేసి రెండేళ్లపాటు కొనసాగించాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది..
- అయితే, అందులో మెరిట్ ఆధారంగా హరీష్ కుమార్ గుప్తా పేరు ఉంటుందని,
- మరో రెండేళ్లపాటు ఆయనకు పోలీస్ బాస్ అవకాశం లభిస్తుందనే ప్రచారం సాగుతోంది..