

అడెల్లి ఆలయానికి రూ.36 లక్షల 46 వేలు ఆదాయం.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 27 – నిర్మల్ జిల్లా, సారంగాపూర్:మండలంలోని
ప్రసిద్ధిగాంచిన అడెల్లి మహా పోచమ్మ ఆలయ హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించారు. ఈ లెక్కింపులో రూ.36 లక్షల 46 వేల ఆదాయం తోపాటు, మిశ్రమ బంగారం 210 గ్రాములు, వెండి 4 కిలోల 700 గ్రాములు వచ్చినట్లు ఈవో రమేష్ తెలిపారు. ఈ హుండీ లెక్కింపుకు దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ రంగు కిషన్ గౌడ్ పర్యవేక్షకులుగా ఉన్నారు.స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలిసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయసిబ్బంది, గ్రామాల్లోని భక్తులు సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు

