అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 07 :- నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ముందస్తుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చి 8 సెలవు దినం కావడంతో ముందస్తుగానే ఈ కార్యక్రమన్ని నిర్వహించడం జరిగిందని కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల్ల బుచ్చయ్య తెలిపారు. ఆయన మాట్లాడుతూ మహిళలు హక్కులు, సామాజిక ఆర్థిక -సాంస్కృతిక- రాజకీయ సహకారాలపై అవగాహన కల్పించడమే దీని ముఖ్య లక్ష్యం అని ప్రతి ఏడాదితో కొత్త థీమ్ తో
నిర్వహిస్తారని అన్నారు. 2025 సంవత్సరం యాక్సిలరేట్ యాక్షన్ అనగా చర్యను వేగవంతం చేయండి అనే ఇతివృత్తంతో లింగ సమానత్వం వైపు పురోగతిని వేగవంతం చేయవలసిన ఆవశ్యకతను నొక్కి చెబుతుందని పేర్కొన్నారు. ఈ థీమ్ వివిధ రంగాలలో ప్రభావితం చేసే వ్యవస్థాపిత అడ్డంకులు, పక్షపాతాలను పరిష్కరించడానికి వేగవంతమైన నిర్ణయాత్మక చర్యలను కోరుతుంది. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను అధిగమించి పురోగతి సాధించినప్పుడే మనం గర్వించదగినటువంటి విషయం అని ప్రతి మహిళ విద్యార్థులు వ్యక్తిగత ఆరోగ్య సమస్యల నుండి బయటపడుతూనే శారీరక మానసిక దృఢత్వులవ్వాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రఘునాథ్, సిపిడిసి ప్రెసిడెంట్ డా.నాగేష్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే గృహమంతా ఆరోగ్యవంతం అవుతుందని గృహంలో ముఖ్య భూమిక వారిదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారిక విభాగం కన్వీనర్ డా కల్పన, డా.నహేద, అధ్యాపకులు,సిపిడి సి సభ్యులు, కార్యాలయ సిబ్బంది విద్యార్థులు ముధోల్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. మహిళ అధ్యాపకులకు వివిధ పోటీలను నిర్వహించి వారిని సన్మానించడం జరిగింది