హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రముఖులు

హోలీ సంబరాల్లో పాల్గొన్న ప్రముఖులు

మనోరంజని ప్రతినిధి మార్చి 14 :- నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గం కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో శుక్రవారం హోలీ పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. హోలీ పండుగను పురస్కరించుకొని బైంసా పట్టణంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు జి విట్టల్ రెడ్డి, నారాయణరావు పటేల్, ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్, భైంసా ఏఎంసీ చైర్మన్ ఆనందరావు పటేల్ సహితం వేడుకల్లో పాల్గొని సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలు ప్రముఖులకు రంగులు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. ప్రముఖులు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖసంతోషాలతో పండుగలను జరుపుకోవాలని ఆకాంక్షించారు. పండుగలు ప్రజల్లో ఐక్యతను పెంపొందించేందుకు దోహదపడతాయన్నారు. ప్రముఖుల నివాసాలు కార్యకర్తలు- నాయకులతో సందడిగా మారాయి. మండల స్థాయిలో సైతం హోలీ పండుగ సందడి నెలకొంది. వివిధ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు సంబరాల్లో పాల్గొన్నారు

  • Related Posts

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 17 :- నిర్మల్ జిల్లా భైంసా పట్టణ కేంద్రంలోని మాజీ కౌన్సిలర్ రాజేశ్వర్ ఇటీవల అనారోగ్య కారణంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు జి. విట్టల్ రెడ్డి కుటుంబ సభ్యులను…

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 17 :- ఆశావర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు సమస్యలు పరిష్కరించాలని మండల కేంద్రమైన ముధోల్ లోని తహసిల్ కార్యాలయంలో తహసిల్దార్ శ్రీకాంత్ కు ఆశావర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం వినతిపత్రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్