హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

హోలీ ముసుగులో గంజాయి విక్రయం.. వీడి అతి తెలివి మామూలుగా లేదుగా..

హైదరాబాద్: హోలీ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఉదయం నుంచీ రంగులు చల్లుకుంటూ వేడుక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఇక, మహానగరం హైదరాబాద్ విషయానికి వస్తే.. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు భిన్న సంస్కృతుల్లో హోలీ జరుపుకుంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే అదునుగా అక్రమార్కులు తమ బుర్రలకు పదును పెడుతున్నారు. హోలీ వేళ డ్రగ్స్ అమ్మేందుకు సరికొత్త ప్రణాళికలు రచిస్తున్నారు. రంగంలోకి దిగిన నగర పోలీసులు అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్ లోయర్ దూల్పేట్ మల్చిపురాలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా, పెద్దా, ఆగ, మగ అంతా కలిసి రంగులు చల్లుకుంటున్నారు. ఇదే అదునుగా గంజాయి విక్రేతలు కొత్త దారులు వెతికారు. ఈ మేరకు కుల్ఫీ ఐస్ క్రీమ్, బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌లో గంజాయి పెట్టి విక్రయాలు ప్రారంభించారు. అయితే డ్రగ్స్ విక్రయంపై సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతమంతా జల్లెడ పట్టి కుల్ఫీ ఐస్ క్రీమ్ అమ్మే సత్యనారాయణ సింగ్ అనే వ్యక్తి పట్టుకున్నారు. నిందితుడి నుంచి గంజాయితో తయారు చేసిన కుల్ఫీ ఐస్ క్రీమ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే బర్ఫీ స్వీట్, సిల్వర్ కోటెడ్ బాల్స్‌నూ సీజ్ చేశారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా నిందితుడు వాటిని తయారు చేసిన విధానం చూసి పోలీసులే అవాక్కయ్యారు. కాగా, సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి తెలిపారు. సాధారణ సమయాలు, పండగల వేళ డ్రగ్స్ కొనుగోలు చేసినా, అమ్మినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని అంజిరెడ్టి సూచించారు.

  • Related Posts

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఫ్లాష్ ఫ్లాష్ అమెరికాలో రోడ్డు ప్రమాదం కొందుర్గు వాసుల మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందినవారు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్…

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం వైద్యం కోసం వచ్చిన వ్యక్తిని మృతి గుడ్డు చప్పుడు కాకుండా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు హాస్పిటల్ ముందు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వైనం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని శ్రీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం