వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

వేసవిలో ఈ జ్యూస్ తాగారంటే..

మండుటెండలతో జనాలు అల్లడిపోతున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే సహజసిద్ధంగా శరీరాన్ని చల్లగా ఉంచడంలో కీరదోసకు మించిన ఆప్షన్‌ మరొకటి లేదు. కీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి.. కీరదోస ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే పోషకాలు శరీరానికి చాలా మేలు చేస్తాయి. పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వలన, అధిక రక్తపోటుతో బాధపడేవారికి ఇది మంచి ఎంపిక. వేసవిలో ప్రతిరోజూ కీరదోస జ్యూస్‌ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.. కీరదోస జ్యూస్‌ మంచి డీటాక్స్ డ్రింక్‌గా కూడా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి ఉదయం ఈ కూరగాయల జ్యూస్ తాగడం వల్ల శరీరం నుంచి అవాంఛిత వ్యర్థాలను బయటకు పంపి శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. ప్రతిరోజూ కీరదోస జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడానికి సహాయపడుతుంది. బరువు కూడా త్వరగా తగ్గుతుంది. బెల్లీ ఫ్యాట్ కూడా కరిగిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఊబకాయం ఉన్నవారికి కీరదోస జ్యూస్‌ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి, దీన్ని ప్రతిరోజూ తినడం కూడా చాలా మంచిది. వేసవి రోజుల్లో కీరదోస జ్యూస్‌ తాగడం వల్ల వేడి అనుభూతిని తగ్గి, శరీరం చల్లబడుతుంది. ఇది వడదెబ్బ నుంచి రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు. అలాగే దీనిలోని పొటాషియం అధిక రక్తపోటును తగ్గిస్తుంది. ఇది మన శరీరంలోని చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా ఇది గుండెను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. కీరదోసలో విటమిన్ K ఎక్కువగా ఉంటుంది. ఇది గాయాల నుంచి రక్తస్రావం కాకుండా వెంటనే రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. దీనిలోని మెగ్నీషియం బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది

  • Related Posts

    ఆరోగ్య రక్షణకూ జాగ్రత్త తీసుకోవాలి

    ఆరోగ్య రక్షణకూ జాగ్రత్త తీసుకోవాలి నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీషర్మిల మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 28 – ప్రజల శాంతి భద్రతలు కాపాడటంలో మరియు నిరంతర ప్రజా క్షేమ కోసం పాటు పడటం లో జిల్లా పోలీసు లు బాధ్యతలు…

    ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం

    ఆపదలో ఉన్నవారికి నిస్వార్థ సేవ – నేతాజీ నగర్‌కు చెందిన వెన్నెల ట్రేడర్స్ రాజు (దత్తు) ఆదర్శం మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 28 :-రక్తదానం ఒక గొప్ప సేవ. అవసరమైన సమయంలో ఎర్ర రక్త కణాలు అందించడం ద్వారా ఎన్నో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    EMIలు కట్టేవాళ్లకు గుడ్‌న్యూస్ : తగ్గనున్న బ్యాంక్ వడ్డీ రేట్లు..RBI News

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో దర్యాప్తు వేగవంతం

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    వరి కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలిజిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి

    శ్రీ రామనవమి శోభాయాత్ర పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి