రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు షురూ

మనోరంజని ప్రతినిధి భూపాలపల్లి జిల్లా: మార్చి 20 – తెలంగాణ పదో తరగతి పరీక్షలు ఈనెల 21 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి, ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది,పరీక్షలు నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లను కూడా పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో తీసుకు వచ్చింది, మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఈ పరీక్షలకు 5,09403 మంది విద్యార్థు లు హాజరుకానున్నారు దీనికోసం 2,650 పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది, ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వ హించనుంది. తాజాగా ఎస్‌ఎస్‌సీ బోర్డు విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం.. మార్చి 21వ తేదీన ఫస్ట్‌ లాంగ్వేజ్‌, మార్చి 22వ తేదీన సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 24వ తేదీన ఇంగ్లీష్‌, మార్చి 26వ తేదీన మ్యాథ్స్‌, మార్చి 28వ తేదీన ఫిజిక్స్‌, మార్చి 29వ తేదీన బయాలజీ, ఏప్రిల్‌ 2వ తేదీన సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు నిర్వహించను న్నారు. అలాగే.. ఏప్రిల్‌ 3న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-1 లాంగ్వేజ్‌ పరీక్ష, ఏప్రిల్‌ 4న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-2 లాంగ్వేజ్‌ పరీక్ష నిర్వహించ నున్నారు

  • Related Posts

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా!

    ప్రారంభమైన ఇంటర్ జవాబు పత్రాల కరెక్షన్స్ .. ఫలితాలు ఎప్పుడో తెలుసా! ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు మార్చి 20 గురువారంతో ముగిసాయి. బుధవారం నుంచే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇంటర్…

    ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

    ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాలని తపస్ జిల్లా నాయకులు అన్నారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) రాష్ట్ర కార్యనిర్వహక వర్గ సమావేశంలో ఇటీవల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలుపొందిన మల్క కొమరయ్య కి తపస్ నిర్మల్ జిల్లా పక్షాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి

    ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటన… బాధితురాలిని పరామర్శించిన రైల్వే ఎస్పీ చందనదీప్తి

    ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు… రేవంత్ కీలక ఆదేశాలు

    ఎస్ఎల్బీసీ సహాయక చర్యలు… రేవంత్ కీలక ఆదేశాలు

    తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

    తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు

    డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి

    డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి