మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే….

మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో అదనపు గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే….

విద్యాభివృద్ధి ద్యేయంగా ముందుకు సాగుతానని, నియోజకవర్గం విద్యారంగంలో మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర ప్రభుత్వ నిధులు ఉషా పథకం కింద మూడు కోట్ల 97 లక్షల రూపాయలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి ఆయన భూమి పూజ చేసిన సందర్భంగా మాట్లాడారు. కళాశాల అభివృద్ధికి మొత్తం ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం జరిగిందని, మిగతా నిధులను కళాశాలలో కంప్యూటర్ లు, ఇతరత్రా పనుల కోసం వెచ్చిస్తామన్నారు. కళాశాల అభివృద్ధి కోసం ప్రిన్సిపల్ అధ్యాపకులు పనిచేస్తున్న తీరును ఆయన అభినందించారు. విద్యార్థులు లక్ష్యసాధన తో ముందుకు సాగి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు కళాశాల అధ్యాపక బృందం ఘనంగా స్వాగతించి, శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే. బుచ్చయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్ , డాక్టర్ నగేష్ తో పాటు పట్టణ మండల బిజెపి నాయకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

  • Related Posts

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 13 :మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి అని రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా…

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం నేడు జిల్లా వ్యాప్తంగా నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం -పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని జీవన్ రెడ్డి పిలుపు మనోరంజని ప్రతినిధి నిజామాబాద్, మార్చి13 :- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి : గ్రంధాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్