ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన కన్నతల్లి

మనోరంజని ప్రతినిధి సంగారెడ్డి జిల్లా మార్చి 28 – సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది, అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లోని స్థానిక రాఘ‌వేంద్ర న‌గ‌ర్ కాల‌నీలో నివాసం ఉంటున్న ఓ మ‌హిళ త‌న ముగ్గురు బిడ్డ‌ల‌కు గురువారం రాత్రి పెరుగ‌న్నంలో విషం క‌లిపి తినిపించి అనంత‌రం తానూ తీసుకుంది. దీంతో ముగ్గురు పిల్ల‌లు ప్రాణాలు కోల్పోయారు. త‌ల్లిని ఆసుప‌త్రికి త‌ర‌లించ‌గా ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. నిన్న‌ రాత్రి ర‌జిత అనే మ‌హిళ‌ త‌న ముగ్గురు పిల్ల‌లు సాయికృష్ణ‌(12), మ‌ధుప్రియ‌(10), గౌత‌మ్‌ (8)ల‌కు పెరుగ‌న్నంలో విషం క‌లిపి పెట్టింది. ఆమె కూడా అదే ఆహారాన్ని తీసుకుంది. భ‌ర్త చెన్న‌య్య‌కు మాత్రం ప‌ప్పు అన్నం పెట్టింది. పెరుగు అన్నం తిన్న ముగ్గురు పిల్ల‌లు ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురు పిల్ల‌ల మృత‌దే హాల‌ను పోలీసులు స్వాధీ నం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ర‌జిత ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. కాగా, కుటుంబ గొడ‌వ‌ల కార‌ణం గానే ర‌జిత ఈ అఘాయి త్యానికి ఒడిగ‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Related Posts

    నీరు లేని బోర్లు… మనోవేదనతో రైతు ఆత్మహత్య

    నీరు లేని బోర్లు… మనోవేదనతో రైతు ఆత్మహత్య మనోరంజని ప్రతినిధి భైంసా ఏప్రిల్ 11 :- నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని రాజురా గ్రామానికి చెందిన నడిపి మల్లన్న (వయసు 60), మున్నూరు కాపు కులానికి చెందిన ఒక చిన్న రైతు.…

    ఎన్‌ఐఏ కస్టడీలో ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా

    ఎన్‌ఐఏ కస్టడీలో ముంబై దాడుల సూత్రధారి తహవూర్‌ రాణా ఉ.11గంటలకు ఎన్ఐఏ ఉన్నతాధికారుల కీలక సమావేశం విచారణపై NIA డీజీతో చర్చించనున్న దర్యాప్తు బృందం తహవూర్‌ రాణాను విచారించనున్న ఎన్ఐఏ అధికారులు ఎన్‌ఐఏ కార్యాలయం ప్రత్యేక సెల్‌లో విచారణ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

    త్వరలో అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్: సీతక్క

    పదేళ్ల తర్వాత పూలే గుర్తుకు – బీఆర్ఎస్‌పై గోవింద్ నాయక్ ఫైరింగ్

    పదేళ్ల తర్వాత పూలే గుర్తుకు – బీఆర్ఎస్‌పై గోవింద్ నాయక్ ఫైరింగ్

    జలవిహార్‌లో మున్నూరుకాపు ప్రతినిధుల సదస్సు – ఏప్రిల్ 13న

    జలవిహార్‌లో మున్నూరుకాపు ప్రతినిధుల సదస్సు – ఏప్రిల్ 13న

    నీరు లేని బోర్లు… మనోవేదనతో రైతు ఆత్మహత్య

    నీరు లేని బోర్లు… మనోవేదనతో రైతు ఆత్మహత్య