

నిద్రిస్తున్న వలస కూలీల పైనుంచి దూసుకెళ్లిన ట్రాక్టర్
భద్రాది జిల్లా : ఫిబ్రవరి 28
ఇంటి స్థలం ప్రక్కన నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ వెళ్లిన ఘటన భద్రాది కొత్తగూడెం జిల్లా చెర్ల మండలంలోని దండుపేట కాలనీ లో శుక్రవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది,
ఇంటి నిర్మాణ స్థలంలో నిద్రిస్తున్న వలస కూలీలపై నుంచి ఇసుక ట్రాక్టర్ తీసుకెళ్లడంతో కుంజం సన్ను(18) అక్కడికక్కడే మృతి ఉండగా మరొకరి పరిస్థితి విషమంగాఉంది, బాధితులు చతిస్గడ్ కు చెందిన వారిగా గుర్తించారు.
గాయాల పాలైన వ్యక్తిని భద్రాచలం ఏరియా ఆసుపత్రి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.