ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

ట్రంప్ ఉక్కుపాదం….లక్ష మంది భారతీయుల్లో H4 వీసా టెన్షన్..

మనోరంజని ప్రతినిధి మార్చి 07


రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు ట్రంప్. అక్రమంగా తమ దేశంలోకి వచ్చిన వారిపైనే కాదు, వీసా గడువు ముగిసాక కూడా అమెరికాలో ఉంటున్న వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. దీంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. హెచ్1బీ వీసా పొందిన వారిపై ఆధారపడిన వారు అంటే వారి పిల్లలు డిపెండెంట్ వీసా-హెచ్4 కింద అమెరికాకు వెళ్లొచ్చు. అక్కడకు వెళ్లిన మైనర్లకు 21 ఏళ్లు వచ్చే వరకు ఈ వీసా పని చేస్తుంది. ఆ తర్వాత రెండేళ్లు సమయం ఇస్తారు. ఆలోపు కొత్త వీసా తీసుకోవాలి.

డిపెండెంట్ వీసాపై వెళ్లిన లక్షా 34 వేల మంది భారతీయుల వీసా గడువు ముగింపు దశకు వచ్చినట్లు అమెరికా వర్గాలు చెప్తున్నాయి. వీసా గడువు ముగుస్తున్న వారికి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ట్రంప్ చెప్తున్నట్లు అమెరికాను వీడి వెళ్లక తప్పదా అన్న ఆందోళన నెలకొంది. వీసా గడువు ముగిసే వాళ్లు ఉన్నత చదువుల కోసం స్టూడెంట్ వీసా ఎఫ్-1కు దరఖాస్తు చేసుకోవచ్చు. కాని ఇది తీసుకోవాలంటే అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్టూడెంట్ వీసా పొందితే.. అంతర్జాతీయ విద్యార్థుల కింద నమోదు అవుతారు. దీని వల్ల భవిష్యత్తులో స్కాలర్‌షిప్ సహా ఇతర ప్రభుత్వ సాయానికి దూరం అవుతారు. దీంతో వారంతా ఈ స్టూడెంట్ వీసా తీసుకోలేక.. గడువు ముగిశాకా ఏం చేయాలో పాలుపోక ఆందోళనకు గురవుతున్నారు.

  • Related Posts

    కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్

    కొద్ది గంటల్లో భూమి మీదకు సునీతా విలియమ్స్ అంతరిక్షంలో 9 నెలలపాటు చిక్కుకుపోయిన భారత సంతతి ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్.. మరికొద్ది గంటల్లోనే భూమికి చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో స్పేస్ నుంచి సునీత విలియమ్స్ తిరుగుపయనం…

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఫ్లాష్ ఫ్లాష్ అమెరికాలో రోడ్డు ప్రమాదం కొందుర్గు వాసుల మృతి అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గానికి చెందినవారు మృత్యువతపడ్డారు. షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి పరామర్శ

    బాధిత కుటుంబానికి పరామర్శ

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    ఆశావర్కర్ల సమస్యలను పరిష్కరించాలని వినతి

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    కరేగాంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్

    బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మోహన్ రావ్ ప్రజా ట్రస్ట్ చైర్మెన్ భోస్లే మోహన్ రావ్ పటేల్