గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

గవర్నర్ ప్రసంగంతో మాకు సంబంధం లేదు: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చి 11 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మా తడాఖా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తామని, గవర్నర్ ప్రసంగంతో తమకు సంబంధం లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. గడిచిన డిసెంబర్‌లో మొదటి సారి గవర్నర్ ప్రసంగంలోని అంశాల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి సంగతి తేలుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం మీద నెపం తెచ్చే ముందు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలపై మాట్లాడాలన్నారు. అంతకు ముందు కాళేశ్వరం మీద అఖిల పక్షం టూర్ పెట్టారని.. ఇప్పుడు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే రాష్ట్రంలో 12 వేలకు పైగా గ్రామాల్లో ప్రభుత్వ పనితనంపై అఖిల పక్షం టూర్ పెట్టాలని.. తాము వస్తామని అన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకున్న వాళ్ళ గురించి తాము మాట్లాడమని (పరోక్షంగా మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరెంటు, నీళ్లు, విద్య, ఉద్యోగం, రైతాంగం, మహిళలు, నిరుద్యోగ యువత, సంక్షేమ పథకాలపై ప్రతి పక్ష పార్టీగా తామే మాట్లాడతామని అన్నారు. రాష్ట్రం విడిపోక ముందు రూ 800 కోట్లు ఉంటే 2014 తరువాత రూ. 5 వేల కోట్లకు కేటాయింపులు పెరిగాయన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక ఎన్ని వేల కోట్లు అప్పులు చేసారో సభలోనే చర్చిద్దామని అన్నారు..

  • Related Posts

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : హిందూ ముస్లింల సఖ్యతకు రూపమే ఇఫ్తార్ విందు అని ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి అన్నారు.దేశంలోని ముస్లిం సోదరులందరూ రంజాన్…

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్: మార్చ్ 13 – తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ తీర్మానం చర్చ సందర్భంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    కోరమాండల్ చేతికి ఎన్ఎసీఎల్

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    బీఆర్ఎస్ నాయకుడు పల్లె శ్రీనివాస్ రెడ్డి ఇఫ్తార్ విందు

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    మార్కెట్ కమిటీ నియామకంపై హర్షం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్

    SBIలో 1,194 పోస్టులు.. ఇంకా మూడు రోజులే ఛాన్స్