కుల్దీప్‌ను మళ్లీ తిట్టిన కోహ్లీ.. మ్యాచ్ అయ్యాక కూడా..

కుల్దీప్‌ను మళ్లీ తిట్టిన కోహ్లీ.. మ్యాచ్ అయ్యాక కూడా..

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి కల నెరవేర్చుకున్నాడు. ఐసీసీ ట్రోఫీ విన్నింగ్ టీమ్‌లో భాగమవ్వాలని అనుకున్న చైనామన్ బౌలర్.. ఏడాది గ్యాప్‌లో తన డ్రీమ్‌ను రెండోసారి నిజం చేసుకున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 గెలిచిన భారత జట్టులో భాగమైన కుల్దీప్.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ-2025ని కైవసం చేసుకున్న టీమిండియా తుదిజట్టులోనూ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇంత చేసినా అతడికి తిట్లు మాత్రం తప్పడం లేదు. అసలు కుల్దీప్‌కు ఈ పరిస్థితి రావడానికి కారణమేంటి అనేది ఇప్పుడు చూద్దాం..

త్రో అందుకోలేక..

చాంపియన్స్ ట్రోఫీ-2025లో కుల్దీప్ పెద్దగా రాణించలేదు. వికెట్లు తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకొని టీమ్‌కు భారమయ్యాడు. అయినా అతడి టాలెంట్‌, అనుభవంపై నమ్మకం ఉంచిన రోహిత్.. కివీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లోనూ ఆడించాడు. కసి మీదున్న కుల్దీప్.. టైటిల్ ఫైట్‌లో 2 కీలక వికెట్లతో చెలరేగాడు. అయితే ఎప్పటిలాగే ఫీల్డింగ్ మిస్టేక్స్‌తో మళ్లీ హిట్‌మ్యాన్‌కు దొరికిపోయాడు. తన బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ వేసిన త్రోను అందుకోలేక తిట్లు తిన్నాడు.

ఆ మాత్రం తెలియదా..

కుల్దీప్ బౌలింగ్‌లో టామ్ లాథమ్ ఆఫ్ సైడ్ కొట్టిన బంతిని కోహ్లీ వెంటనే అందుకున్నాడు. నాన్ స్ట్రయికర్ ఎండ్‌కు విసిరాడు కింగ్. కానీ వికెట్లకు దూరంగా ఉన్న కుల్దీప్.. బంతిని అందుకోకుండా దూరం నుంచి చూస్తూ ఉండిపోయాడు. అతడు గనుక స్టంప్స్ దగ్గరకు వచ్చి బాల్‌ను పిక్ చేసుకొని కొట్టేసి ఉంటే లాథమ్ రనౌట్ అయ్యేవాడు. కానీ కుల్దీప్ నిర్లక్ష్యంతో బతికిపోయాడు. ఇది చూసిన రోహిత్, కోహ్లీ సీరియస్ అయ్యారు.

ఎందుకు పట్టుకోలేదు..

బంతిని ఎందుకు పట్టుకోలేదంటూ కుల్దీప్‌ వైపు చూస్తూ విరాట్ ఏదో అన్నాడు. ఆ వీడియో చూస్తే బూతులు తిడుతున్నట్లే ఉందని నెటిజన్స్ అంటున్నారు. కుల్దీప్ తప్పిదం చూసిన గంభీర్ కూడా అలా మిస్ అయ్యిందేంటి అనేలా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. రోహిత్ అయితే ఏం చెప్పాలో తెలియక తల మీద చేతులు పెట్టుకొని సైలెంట్ అయిపోయాడు. కాగా, సెమీస్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ కుల్దీప్ ఇలాగే బంతిని అందుకోకుండా దూరం నుంచి తమాషా చూడటంతో రోహిత్-కోహ్లీ ఇద్దరూ బూతుల దండకం అందుకున్నారు. ఇకపోతే, మ్యాచ్ టైమ్‌లో తిట్టుకున్నా కప్పు గెలిచాక కుల్దీప్‌ను రోహిత్-విరాట్ హగ్ చేసుకున్నారు. అతడితో కలసి సంబురాలు చేసుకున్నారు.

  • Related Posts

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’

    దేశ వ్యాప్తంగా 5G సర్వీసు’ భారతదేశంలో ప్రస్తుతం దేశనలుమూలల 5G సర్వీసు లభిస్తోందని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న 776 జిల్లాల్లో 773 జిల్లాలకు ఈ సర్వీసు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. టెల్ కమ్ సంస్థలు ఇచ్చిన సమాచారం మేరకు అన్ని…

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ప్రయాణించే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.. ఇకనుంచి తమ ప్రయాణ సమయంలో చిప్స్, శీతల పానీయాలు, బిస్కెట్లు, ఇతర ప్యాక్ చేసిన ఆహార పదార్థాలను ప్రయాణికులు ఆస్వాదించవచ్చని.. ఇండియన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    ధర్మబధ్ధంగా జీవితం గడపాలనే ఉద్దేశ్యంతో కామ దహనం

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ జడ్పి చైర్మన్

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    పాఠశాలల్లో ముందస్తుగా హోలీ పండుగ సంబరాలు

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    గ్రామాల్లో ఘనంగా కామ దహనం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఈ నెల 16న బాసరలో అష్టావధానం

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే

    ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే