ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌

మనోరంజని ప్రతినిధి అమరావతి :మార్చి 29 – వచ్చే పది రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు.టిడిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శనివారం మంగళగిరిలో పార్టీ కార్యాలయంలో ఆయన ప్రసంగించారు. ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తామని, జూన్‌లో పాఠశాలలు తెరిచేలోపు నియామకం చేపట్టనున్నట్లు ఆయన వివరించారు..గతంలోనేడీఎస్సీ నోటిఫికే షన్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు కేబినెట్​లోనూ తీర్మానం చేసింది.మెగా డీఎస్సీ ద్వారా మొత్తం 16,347 పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని స్థానికుల తోనే 80 శాతం ఉపాధ్యా య ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో పాఠశాల విద్యా శాఖ పరిధిలో 13,661 పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 ఖాళీలు ఉన్నాయి. అలాగే విభిన్న ప్రతిభా వంతుల సంక్షేమ శాఖ పరిధిలో 49, బాల నేరస్తులకు విద్యా బోధన కోసం 15 టీచర్ పోస్టులు ఉండనున్నాయి.మరోవైపు సంక్షేమ పథకాల అమలు విషయంలో అంతిమ లబ్ధిదారు వరకూ ఫలాలు చేరాల్సిందేనని, మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు

  • Related Posts

    నేడు సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

    నేడు సీఎం చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన మనోరంజని ప్రతినిధి అమరావతి ఏప్రిల్ 09సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో తన సొంత ఇంటి నిర్మాణం పనులకు బుధవారం శంకుస్థాపన చేయనున్నారు. ఈరోజు ఉదయం 8:51 గంటలకు కుటుంబ…

    టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌

    టీటీడీ టికెట్లు వాట్సాప్‌లో ఇలా చిటికెలో బుక్‌ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌.. ఆంధ్రప్రదేశ్ సర్కారు వాట్సాప్ గవర్నెన్స్‌ ప్రారంభించి అనేక రకాల సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. క్రమంగా మరిన్ని సేవలను ఇందులో చేర్చుతున్నారు. తాజాగా, టీటీడీకి సంబంధించి నాలుగు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాధిత కుటుంబానికి ఆర్థిక సాహయం

    బాధిత కుటుంబానికి ఆర్థిక సాహయం

    జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరిరక్షణ సన్న హ సమావేశ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్

    జై బాపు జై భీమ్ జై సంవిధాన్ పరిరక్షణ సన్న హ సమావేశ పాదయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయ గౌడ్

    పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసా అందించిన అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్

    పేదింటి ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక భరోసా అందించిన అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ ఫౌండేషన్

    ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ

    ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ