ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు

మనోరంజని ప్రతినిధి నిజామాబాద్ మార్చి 04 ఎస్సి రిజర్వేషన్ల వర్గీకరణపై మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మార్చి 4 నుండి 10 వరకు గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ డప్పు ప్రదర్శనలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సిరికొండ మండల కేంద్రంలో అధ్యక్షుడు మొట్టల దీపక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్, జిల్లా ఇంచార్జ్ ఇంజం వెంకటస్వామి హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, జస్టిస్ షమీమ్ అక్తర్ నివేదికలో 11 శాతం రిజర్వేషన్ రావాల్సిందిగా సూచించబడినా, కేవలం 9 శాతానికి పరిమితం చేసారని మండిపడ్డారు. ఈ లోపాలను సవరించి అన్ని వర్గాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గందమాల నాగభూషణం మాదిగ, జాతీయ మహిళా నాయకురాలు యమున, జిల్లా ప్రధాన కార్యదర్శి పిప్పర సంజీవ్, ధర్పల్లి మండల ఇంచార్జ్ నక్క రాజేందర్, డప్పు నర్సయ్య, సంగేమ్ కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    బస్సు బోల్తా.. 20 మందికి తీవ్రగాయాలు

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు