ఆప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించలేం.. తేల్చిచెప్పిన కేంద్ర ప్రభుత్వం

ఢిల్లీ: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం వెనక్కు పంపింది. కృష్ణా నదీ జలాల వినియోగంపై రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుత వివాదం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కృష్ణా ట్రిబ్యునల్2 ఇందుకు సంబంధించిన విచారణ చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ అధికారులు ప్రస్తావించారు. కోర్టు వివాదం నేపథ్యంలో.. ఈ ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్ రిపోర్ట్‌ను పరిగణనలోకి తీసుకోవడం సాధ్యం కాదని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్రానికి తిరిగి పంపినట్లు లోక్‌సభలో కేంద్రం తెలిపింది. 2022 సెప్టెంబర్‌లో ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జల సంఘానికి ప్రతిపాదనలు పంపిందని కేంద్ర ప్రభుత్వం గుర్తుచేసింది. 2024 డిసెంబర్‌లో ఈ ప్రతిపాదనలు తిప్పి పంపామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లోక్‌సభలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం జాతీయ ప్రాజెక్టు విషయంపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.. KP

  • Related Posts

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం

    తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ్ సై కి పితృవియోగం మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:ఏప్రిల్ 09తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ మాజీ చీఫ్ కుమార్ అనంతన్ (93) ఈరోజు తెల్లవారు జామున చెన్నైలో…

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!!

    Waqf Amendment Act: అమల్లోకి వచ్చిన వక్ఫ్ చట్టం.. ప్రభుత్వ నోటిఫికేషన్ విడుదల..!! న్యూఢిల్లీ: పార్లమెంటులో గత వారం ఆమోదం పొందిన వక్ఫ్ సవరణ చట్టం ఈరోజు (ఏప్రిల్ 8) నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారంనాడు ఒక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బీజేపీ అనుసరిస్తూ వైఖరిని ప్రజలకు వైవర్శించాలి.-రాజ్యాంగాన్ని కాపాడాలి.

    బీజేపీ అనుసరిస్తూ వైఖరిని ప్రజలకు వైవర్శించాలి.-రాజ్యాంగాన్ని కాపాడాలి.

    ఆర్మీలో సేవలు అందించడం అభినందనీయంఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

    ఆర్మీలో సేవలు అందించడం అభినందనీయంఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్

    జొన్న రైతుకు అండగాత్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంపరిమితి పెంచాలని మంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యేవెల్లడి

    జొన్న రైతుకు అండగాత్వరలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభంపరిమితి పెంచాలని మంత్రికి విన్నవించినట్లు ఎమ్మెల్యేవెల్లడి

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు

    గిరిజన యువకుడు దారుణ హత్యగొడ్డలితో నరికి చంపిన దుండగులు