అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి మొదలుకానున్నాయి..

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రేపటి (బుధవారం) నుంచి మొదలుకానున్నాయి..

2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్​తో పాటు కీలక బిల్లు లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సభ ఆమోదం తీసుకోనున్నారు. ఈ నెల 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి.. గవర్నర్​ ప్రసంగం ఉంటుంది. గవర్నర్​ ప్రసంగంపై మరుసటిరోజు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ కావడంతో సభ జరగదు. ఒకవేళ ధన్యవాద తీర్మానం చర్చ కౌన్సిల్​లో పూర్తికాకపోతే 15న కూడా దానిపై చర్చించే చాన్స్​ ఉంది. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లుపై, 18న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లులపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని సమాచారం. ఈ నెల 19న రాష్ట్ర బడ్జెట్​ను ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత పద్దులపై చర్చించనున్నారు. నెలఖారు వరకు బడ్జెట్​ సమావేశాలు కొనసాగించనున్నట్లు సమాచారం. ఒకవేళ రాష్ట్ర బడ్జెట్​ను 17న పెడితే.. చివరలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు పెట్టే అవకాశం ఉంటుంది. బీఏసీ సమావేశంలో చర్చించిన తరువాత సభ నిర్వహించే రోజులపై పూర్తి క్లారిటీ రానుంది.

బీసీ, ఎస్సీ ఎజెండాతో ప్రభుత్వం..ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు
బడ్జెట్​ సమావేశాలు ఈసారి గరం గరంగా సాగనున్నట్లు తెలుస్తున్నది. మాజీ సీఎం, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్​ కూడా సభకు హాజరవుతానని సంకేతాలు పంపించారు. దీంతో మొత్తం బడ్జెట్​ సమావేశాలు పూర్తయ్యే వరకు రోజూ ఆయన వస్తారా లేక ఒకటి, రెండు రోజులు మాత్రమే వస్తారా? అనేదానిపై క్లారిటీ లేదు. ప్రతిష్టాత్మకమైన 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లులతో పాటు ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుండటంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో సభలో వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకోసం గత ప్రభుత్వం పదేండ్లలో బీసీలు, ఎస్సీలకు ఏం చేసిందనే దానిపై బీఆర్​ఎస్​ను ఎండగట్టనుంది. దేశవ్యాప్తంగా కులగణన చేసి బీసీలకు తగిన విధంగా రిజర్వేషన్లు కల్పించాలని బీజేపీని కార్నర్​ చేయనుంది. సాగు, తాగునీటితో పాటు రుణమాఫీ, రైతు భరోసా, గురుకులాలు, గ్యారంటీల అమలుపై అధికార పక్షాన్ని ప్రతిపక్షాలు ఇరుకునపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి.

  • Related Posts

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం తెలంగాణ : అసెంబ్లీలో రైతు రుణమాఫీపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దీనిపై బీఆర్ఎస్…

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలుతెలంగాణలో గురువారం నుంచి ఎండలు కాక పుట్టించనున్నాయి. హైదరాబాద్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు పగటి పూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకూ నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    రైతు రుణమాఫీపై సభలో మాటల యుద్ధం

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    రైతు భరోసాపై సీఎం స్పష్టత

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.

    గ్రూపు. 1.2.3.4లో రాష్ట్ర స్థాయి లో ర్యాంకులు సాధించిన. జెటప్రోలు. విద్యార్థి. మున్నూరు కాపు ముద్దబిడ్డ..హావల్దారి శ్రీనాథ్.