అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండిపోతే ఏం జరుగుతుంది.. శరీరంలో వచ్చే మార్పులేంటి..

అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండిపోతే ఏం జరుగుతుంది.. శరీరంలో వచ్చే మార్పులేంటి..

అంతరిక్ష వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ఎనిమిది రోజుల మిషన్ కోసం అంతరిక్షంలోకి వెళ్లారు. స్పేస్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో తొమ్మిది నెలలుగా అక్కడే ఉండిపోయారు. మరికొద్ది గంటల్లో వారు భూమి మీదకు రాబోతున్నారు. నెలల తరబడి అంతరిక్షంలో ఉండిపోతే ఏం జరుగుతుంది? వారి శరీరం ఎలాంటి మార్పులకు గురవుతుంది? అంతరిక్షంలో సుదీర్ఘ కాలం గడపడం వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఎముకలు, కండరాలు మార్పులకు గురవుతాయి.
అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన రికార్డు ఇప్పటివరకు రష్యాకు చెందిన వ్యోమగామి వాలెరి పాలియకోవ్ పేరిట ఉంది. పాలియకోవ్ 1990లలో మిర్ అంతరిక్ష కేంద్రంలో 437 రోజుల పాటు ఉన్నారు. తాజాగా సునీత విలిమయ్స్, బుచ్ విల్‌మోర్ కూడా సుదీర్ఘ కాలం అంతరిక్షంలోనే గడిపారు. వీరికి అంతరిక్షయానం కొత్త కాకపోయినప్పటికీ వీరి శరీరంలో కూడా కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉంటుంది. అలాగే శరీరంపై ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. దీంతో అంతరిక్షంలో మనుషుల కీళ్లు, కండరాలు, ఎముకల సాంద్రత చాలా వేగంగా తగ్గిపోతుంది. రెండు వారాలకే వారి కండర ద్రవ్యరాశి 20 శాతం తగ్గుతుంది. ఇక సుదీర్ఘ మిషన్లలో పాల్గొనే వారికి 30 శాతం వరకు కండరాల క్షీణత ఉండొచ్చు.
అలాగే శరీరంపై ఒత్తిడి తక్కువగా ఉండడం వల్ల ఎముకలు పోషకాలను కోల్పోతాయి. అలాగే ఎముకల పటిష్టత కూడా తగ్గుతుంది. అంతరిక్షంలో గడిపిన ఒక్కో నెలకు వ్యోమగాములు 1-2 శాతం ఎముకల ద్రవ్యరాశిని కోల్పోతారు. ఇలా జరిగితే చాలా చిన్న ప్రమాదాలకు కూడా ఫ్రాక్చర్లు జరుగుతాయి. అలాగే వాటి నుంచి కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. అంతరిక్షంలో ఎక్కువ కాలం గడిపిన వ్యోమగాములు భూమి మీదకు వచ్చిన తర్వాత ఎముకల ద్రవ్యరాశిని తిరిగి పొందడానికి కనీసం నాలుగేళ్లు పడుతుంది. ఈ ప్రమాదాన్ని నివారించడానికే అంతరిక్షంలో వ్యోమగాములు వ్యాయామాలు చేస్తారు. ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అదనపు పోషకాలను తీసుకుంటారు.
ఇక, భూమిపై ఉన్నప్పుడు శరీరం అంతటికీ రక్త సరఫరా సజావుగా సాగుతుంది. శరీరంలోని పై భాగాలకు గుండె రక్తాన్ని పంప్ చేస్తుంది. కింది భాగాలకు గురుత్వాకర్షణ కారణంగా రక్త ప్రవాహం జరుగుతుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు ఈ రక్తసరఫరా విషయంలో గందరగోళం నెలకొంటుంది. అంతరిక్షంలో రెండు వారాల కంటే ఎక్కువ ఉన్న వారి తలలో రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది. కంటి వెనుకభాగంలో, ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది. దీంతో కంటి భాగంలో వాపు ఏర్పడి చూపులో సమస్యలకు కారణం అవుతుంది..

  • Related Posts

    రక్తదానం చేయండి – నిండు ప్రాణాలు కాపాడండి

    మనోరంజని ప్రతినిది భైంసా మార్చి 21 – నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం జి.డి.ఆర్ ఆసుపత్రిలో బల్గాం గ్రామానికి చెందిన సునీతకు వైద్యురాలు దీప జాదవ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. రోగికి అత్యవసరంగా రక్తం అవసరమని తెలియడంతో బ్లడ్ డోనర్స్…

    శ్రీ వందన ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు అభినందనీయం –

    శ్రీ వందన ఆసుపత్రి ఉచిత వైద్య సేవలు అభినందనీయం – వి. సత్యనారాయణ గౌడ్ మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 21 :- నిర్మల్ జిల్లా సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో శ్రీ వందన ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత వైద్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    బెట్టింగ్ యాప్​లకు మరో యువకుడు బలి

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తత ఆదేశాలు

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.

    నర్సింగాపూర్, కిష్టాపూర్ గ్రామపంచాయతీలను సందర్శించిన ఎంపీ ఓ.